ఉద్దేశ్యం

ఈ బ్లాగు యొక్క ఉద్దేశ్యం విషవృక్షం పుస్తకాన్ని సమీక్షించి ఆ పుస్తకం రచయిత్రి రామాయణం గురించి చేసిన కువిమర్శలు/విషప్రచారాలను బయట పెట్టడం. ఇందులో రచయిత్రి వ్యక్తిగత విషయాలు గానీ, అసభ్య పదజాలం గాని ఉండదు. ఒక వేళ ఎవరి వ్యక్తిగత విషయాలైనా చర్చకువస్తే అది ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయడానికే తప్ప అవమానించడానికి మాత్రం కాదు. గమనించగలరు!

Monday 28 May 2012

రామాయణమే ఎందుకు??

ఈ  విష వృక్షం గురించి తెలిసినప్పుడు నాకు వచ్చిన మొదటి డౌటు "రామాయణమే ఎందుకు?? వేరే పుస్తకాల గురించి ఎందుకు రాయలేదు" వేరే పుస్తకాలంటే ఖురాన్, బైబిల్  లాంటివి కాదు. ఎందుకంటే వాటి గురించి రాసుంటే రాసిన రంగనాయకమ్మ పబ్లిష్ చేసిన పబ్లిషర్ ఇద్దరూ కాలగర్భం లో కలిసిపోయి కనీసం మూడు దశాబ్దాలు అయ్యేది. భారతం విషవృక్షం , భాగవతం విషవృక్షం లాంటివి రాసి ఉండచ్చు. తిట్టడమే ధ్యేయమైనప్పుడు ఏ పుస్తకాలైతే ఏం తేడా వస్తుంది?? పై పెచ్చు రాముడి ఆత్మ, సీత లో సీత లాంటి పాత్రలు సృష్టించడానికి  కూడా పుస్తకం ఏమిటన్నది అనవసరం. అయినా కూడా రంగనాయకమ్మ రామాయణాన్నే ఎంచుకుంది. దీనికి  నాకు తోచిన కారణాలు ఇక్కడ రాస్తున్నా..

౧. ఫలానా ఎవరు??
తెలుగు సినిమా డైరెక్టర్ యస్వీ కృష్ణారెడ్డి గారి మొదటి సినిమా పేరు "కొబ్బరి బోండాం". ఆ సినిమాకు ఆ పేరేందుకు పెట్టారని అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం "ఆ పేరు వింతగా ఉంది కాబట్టి అందరూ సినిమా తీశింది ఎవరు అని ఇంటరెస్ట్ చూపిస్తారు, మొదటి సినిమా తర్వాత నాకు అది ఉపయోగ పడింది అని". రంగనాయకమ్మ కూడా ఖచ్చితంగా ఈ సిద్దాంతాన్నే వాడుకుంది. ప్రచారం రావాలంటే ఎదో ఒక గొప్ప పని చేస్తే రావాలి లేదా ఎవరైనా  ఆల్రెడీ ఫేమస్ వ్యక్తి ద్వారా రావాలి. రంగనాయకమ్మ నమ్మే మార్క్స్ -మావో ఈ దేశానికి ఏ మాత్రం సంబంధం లేని వారు.. వారి భజనలు ఎంతగా చేసినా ఎవరూ పట్టించుకోరు. అందుకని ఈ మార్గం లో వార్తలలో నిలిచింది. ఇందులో తప్పేమీ లేదు. కీర్తి కండూతి మనిషిలోని జ్ఞానాన్ని చంపేస్తుంది అంటారు.
౨. publicity mongering
౨౦౦౬ లో మొయిన్ ఖాన్ అనే పాకిస్తానీ క్రికెటర్  "సచిన్ కళ్ళల్లో భయాన్ని చూశాను" అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు  యాహూ సెర్చ్  టాప్ సెర్చెడ్ ఐటెంస్ లో మొయిన్ ఖాన్ పేరు ఉంది. రంగనాయకమ్మ చేసింది ఇదే.. చాలా కాలం క్రితం కవి సామ్రాట్ విశ్వనాథ గారు "రామాయణ కల్పవృక్షం" అనే ఒక పుస్తకం రాశారు. అందులో రామాయణం నుంచీ నేర్చుకోవాల్సిన విలువల గురించి రాశారు. కవి సామ్రాట్ రాసినదాన్ని విమర్శించారంటే సహజంగానే పాఠకులలో కుతూహలం ఉంటుంది దాన్ని సొమ్ము చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం తప్పూ కాదు అందులో ఏ రకమైన దోషం కూడా లేదు. ఎవరి మానసిక స్థాయికి తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. దానికి వాళ్ళను తప్పు పట్టలేము. స్వాతి చినుకు  ముత్యపు చిప్ప పైన పడితే అది ముత్యమౌతుంది తాచుపాము తలపై పడితే అది విషమౌతుంది.
౩. సినిమాల ప్రభావం:
విషవృక్షం మొదటి  పుస్తకం వచ్చింది ౧౯౭౫ ప్రాంతం లో.. అంతకు రెండు మూడు దశాబ్దాలుగా రాముడి గురించిన సినిమాలు   ప్రతీ రెండు మూడేళ్ళకు ఒక సూపర్ హిట్ సినిమా రానే వచ్చింది.ఇంక రామాయణం నాటకాలు, బుర్ర కథలు వగైరా వీటికి అదనం. ఇక భద్రాచలం లాంటి  ప్రసిద్ద పుణ్య క్షేత్రాల ద్వారా రాముడి గురించిన విషయాలు ఎప్పుడు ఏదో విధంగా చర్చలలో ఉండనే ఉంటాయి. ఇంత పాపులర్ అయిన రాముడి గురించి ఏం రాసినా అది వార్తే అవుతుంది. ఈ పాయింట్ ను రంగనాయకమ్మ పూర్తిగా వాడుకుంది.
౪. మార్కిజం:
రంగనాయకమ్మ  మార్క్సిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆ సిద్దాంతాలను ప్రజలకు చెప్పాలి అంటే ముందుగా  సమాజం లో ఉన్నతంగా ఉండే వ్యక్తులను/విలువలను టార్గెట్ చెయ్యాలి. మన సమాజం లో రాముడు ఆ పొజిషన్ లో ఉన్నాడు (శతాబ్దాలుగా). ప్రతీ పురుషుడికి రాముడిని ఆదర్శ మూర్తిగా మన పెద్దలు చెబుతారు. అలాంటి రాముడి తెగడుతూ రాస్తే  "అసలు రాముడిని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది?" అనే ఇంటరెస్ట్ పుస్తకం కొనేవాళ్ళు ఉంటారు. పైగా అవసరం అయినా లేకపొయినా తను నమ్మిన కమ్యునిజం గురించిన విషయాలు చెప్పటానికి ఒక ప్లాట్ ఫారం దొరుకుతుంది. (విషవృక్షం  పుస్తకం మొదటి పేజిలో "నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఏ వర్గమో తెలుసుకో" -మార్స్కిస్ట్ అని ఉంటుంది.)

పైన చెప్పిన కొన్ని కారణాల వల్ల రంగనాయకమ్మ  తన పైత్య ప్రకోపాన్ని విశృఖలంగా ప్రదర్శించడానికి  రామాయణాన్ని ఎంచుకుంది.

ఇక ఇప్పుడు రంగనాయకమ్మ అభిమానులు ఈ పుస్తకం గురించి చెప్పిన విషయాలు చూద్దాం:
౧. స్త్రీ అభ్యుదయం వగైరా:
దీని గురించిన సమగ్రమైన చర్చ మరొక టపాలో చేస్తాను. (ఆ టపాకు ఇంకా కొంచెం టైం ఉంది)
అంతలోపు ఒక విషయం, స్త్రీల గొప్ప తనం గురించి రాయాలంటే  రాణీ రుద్రమ్మ దేవి నుంచీ  నేటి జాతీయోద్యమం వరకూ చాలామంది ధీరవనితలు ఉన్నారు. వారి గురించిన విషయాలు స్పూర్తిదాయకంగా రాయచ్చు. కానీ అవి ఎందుకు రాయలేదు?? కమ్యూనిస్టులకు భారతీయులు సరిపోరు అనుకుంటే ఫ్లోరెంస్ నైటింగేల్, జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి వాళ్ళ గురించి కూడా రాయలేదు.. ఎందుకట?? male bashing is NEVER equal to woman empowerment.

౨.ఆ పుస్తకం   మూడు సార్లు పున:ముద్రణ పొందింది. అది ఈ పుస్తకం పాపులారిటీని సూచిస్తుంది:
మూడు సార్లు పున: ముద్రణ పిందడం ఏ పుస్తకానికైనా చాలా మంచి విషయం. కానీ పున:ముద్రణ వెనకాల ఉన్న  కారణాలను చూద్దాం:
అ) అప్పట్లో ఆడవాళ్ళకు పత్రికలు/పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేవాళ్ళు. వాళ్ళను విక్టిమైజ్ చేస్తూ  రంగనాయకమ్మ బలిపీఠం లాంటి ఊకదంపుడు పుస్తకాలు రాసింది. సహజంగా  అలాంటి రచయిత నుంచీ వచ్చిన రచనలంటే వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఆ లేడీ మార్కెట్ ను బాగా వాడుకుంది.
ఆ) మిషనరీలు రాముడిని దూషించడానికి తమ దేవుడు గొప్ప వాడని చెప్పుకోవడానికి ఈ పుస్తకాన్ని వాడుకుంటున్నారు. ౧౯౯౮ లో ఒకానొక మిషనరీ రామాయణ విషవృక్షం పుస్తకం లోని విషయాలను చూపిస్తూ రాముడిని కించపరచడం నేను చూశాను. అంతే కాక ఈ వ్యాసం రాయడానికి ముందు నాకు తెలిసిన కొందరు వీ.హెహ్.పీ. కార్యకర్తలకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కంఫరం చేసుకున్నాను. వాళ్ళకు మిషనరీల మోడస్ ఆపరెండీ బాగా తెలుసు. మరి రంగనాయకమ్మ మిషనరీల దగ్గర నుంచీ ఎంత డబ్బు తీసుకుందో నాకు తెలీదు. 
ఇ) కమ్యూనిస్టులు ఈ  పుస్తకాన్ని తమ క్యాడర్లలో పంచడం.

౩. మొన్న మరొక కమ్యూనిస్టు చెప్పినట్టు వర్గ దృక్పథం:
సమాజమంతా ఎప్పుడూ ఒకటిగా లేదు. అది వర్గాలుగానే ఉంది అనేది కమ్యూనిస్టుల భావన. ఆ భావజాలాన్ని endorse చేసేందుకు ఈ పుస్తకం పనికి వచ్చింది.

సర్వేజనా సుఖినోభవంతు.
- రామదండు.
 

Thursday 24 May 2012

పీఠిక లోనే మొదలైన పీడ - 2: కొన్ని కామెడీలు

ముందుగా ఈ క్రింది వాక్యాలు చదవండి. ఇవి విషవృక్షం పుస్తకం యొక్క contents గురించి రంగనాయకమ్మ రాసినవి.

ఈ కథల్లో ముఖ్యంగా నాలగు విషయాలు ఉంటాయి:
1. కవి చెప్పవలసి ఉండి కూడా చెప్పనివి
2. చెప్పడానికి ఇష్టపడనివి
3. చెప్పినా మసిపూసి మారేడు కాయ చేసినవి
4. చాలా స్పష్టంగా చెప్పినవి

 1. కవి చెప్పవలసి ఉండి కూడా చెప్పనివి
ఇంతకంటే అర్థం లేని  వాదన ఏమన్నా ఉంటుందా?? వాల్మీకి మహర్షి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా రంగనాయకమ్మనే నిర్ణయించాలా?? ఆయన పుస్తకం ఆయనకు నచ్చిన విధంగా రాసుకునే స్వతంత్రం ఆయనకు లేదా?? కమ్యూనిస్టుల కాలం లో పుట్టకపోవడం వల్ల ఆయనకు నచ్చిన విధంగా రాసుకునే హక్కు ఆయనకు ఉణ్ణింది. ఆ ప్రకారమే ఆయన రచించాడు.రంగనాయకమ్మ ఈ విషయం రాసింది సరే, కనీసం పుస్తకం అచ్చు వేసేటప్పుడు ఎడిట్ చేసే ఎడిటర్ కన్నా ఈ విషయం  వింతగా అనిపించలేదా??  సాటి రచయితకు( వాల్మీకి మహర్షి మరణించి ఉండచ్చు గాక)  కనీసం గౌరవం ఇవ్వలేదని అనిపిస్తోంది. 

2. చెప్పడానికి ఇష్టపడనివి
వాల్మీకి మహర్షికి ఏమి ఇష్టమో, ఏమి ఇష్టం లేదో కూడా రంగనాయకమ్మ నే డిసైడ్ చేస్తుందన్నమాట!!  శెబాసో!

3. చెప్పినా మసిపూసి మారేడు కాయ చేసినవి
ప్రతీ రచయిత/కవికి తమకంటూ ఒక శైలి అంటూ ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆయన సొంత శైలిలో ఆయన రాశాడు. అంతమాత్రం దానికి మసిపూసి మారేడు కాయ చేశాడని అనటం ఎలాగైనా నిందించాలనే తపన తప్ప మరొకటి కాదు. My dear lady! Get Well Soon!

4.చాలా స్పష్టంగా చెప్పినవి
స్పష్టంగా చెప్పినవి అనేకంటే "నాకు స్పష్టంగా అర్థం అయినవి" అని రాసుంటే బాగుండేది. ఎందుకంటే ఆమెకు స్పష్టమైనవి అందరికీ స్పష్టం కావాలని రూల్ లేదు. ఆమె స్పష్టత ఏపాటిదో ముందు ముందు చూద్దాం.

ఇప్పుడు పైన చెప్పిన నాలగు కేటగిరీల గురించి రంగనాయకమ్మ రాసిన విషయాలు చూద్దాం:

1.కవిచెప్పవలసి ఉండి కూడా చెప్పనివి:
గొడ్లని కూడా పేజీల తరబడి వర్ణించిన కవి, 'ఊర్మిళ '  సంగతి ఎక్కడా ఎత్తలేదు. ఈపాత్ర గురించి ఒక్కమాటైనా చెప్పనవసరం లేదా?? భర్తతో అడవికి వెళ్ళిన సీత గొప్ప పతీవ్రత అయినప్పుడు, భర్తతో వెళ్ళని ఊర్మిళ సీత అంత పతీవ్రత అవదు కదా.. కాబట్టి, ఈ ఆధారంతో, ఊర్మిళ భర్త పట్ల అనాసక్తంగా ఉందని, ఈమె సీత అంత మహాపతివ్రత కాదని నేను రాస్తే, అది నా స్వంత కల్పన అవుతుందా?? ఇది మూలం లో లేని ఘటనే అయినా, "మూల విరుద్దం" అనటానికి వీలుందా??

ఒక స్త్రీ పాతివ్రత్యాన్ని బేరీజు వేయడం ఏమిటో?? దానికి మళ్ళీ  ఫలానా మెట్రిక్ ఆధారంగా అన్నాను అని చెప్పుకోవడం. ఇదే లాజిక్ ఒకానొక మహిళ కు ఆపాదిస్తే ఎలా ఉంటుంది అని నాకనిపిస్తోంది. కానీ పెద్దలు, గురువులు నేర్పిన సంస్కారం అడ్డం పడుతోంది. ఈ విషయం మీద మరింత చర్చ మరొక సందర్భం లో చేద్దాం. 
గొడ్లని కూడా అని రాయడం వెనుక జంతువుల పట్ల రంగనాయకమ్మకు ఉన్న చులకన భావం కనిపిస్తోంది. అది మానవ సహజమే అయినా ఒక పుస్తకం రాసేటప్పుడు ఇలాంటి వాక్యాలు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. 

2. కవికి చెప్పడానికి ఇష్టం లేనివి:
రాముడు, లక్ష్మణుడు, సీతా అడవుల వెంటా, అప్పుడప్పుడూ పల్లెల వెంటా నడిచి వెళ్తూ ఉంటారు. వారికి దారి పొడుగునా "రుషులే" కాని ఇంకెవ్వరూ తారసపడరు. ఎందు చేత? పల్లెల్లో సామాన్య ప్రజలెవ్వరూ ఉండరా?? ఎందుకు ఉండరు?? ఉంటారు. కానీ వారిని గురించి చెప్పడం కవికి ఇష్టం లేని విషయం. ఎప్పుడూ రుషుల వంటి మహాత్ముల గురించే చెప్పాలి. కానీ అడవుల్లో ఆటవికులో కట్టెల మనుషులో కనపడ్డారని రాయడం వల్ల కావ్య సౌందర్యమేమీ కొరతపడదు. అయినా కవి అలాంటివారిని చెప్పలేదు. నేను, వాళ్ళని కూడా చెప్పాను. దారిలో అక్కడక్కడా కొందరు రైతులూ, కట్టెల మనుషులు, ఒక చాకలి, ఒక భిక్షకుడు జానపదులూ, ఇతర ప్రయాణికులూ తారసపడ్డారని నేను రాస్తే అది మూల కథకు విరుద్ధం అవుతుందా?? "అలా వీల్లేదు. అక్కడ పేదలు కనబడడం జరగదు. అది తప్పు" అని వాదించడానికి వీలౌతుందా??

నాకు పీఠిక మొత్తం లో ఎక్కువగా నవ్వు తెప్పించిన పేరా ఇదే.. అసలు కావ్యం లో లేనివి సుబ్బరంగా రాసేసి అది మూల కథకు విరుద్ధం కాదు వాదించడం ఏమిటో.. ఇలా మనకు కావాల్సినవి రాసుకుని దానికి మూలం "ఫలానా కథ" అని చెప్పడం తొండి ఆట (Foul Play). మరొక విషయం, అసలు రుషులు తప్ప ఇంకెవరి గురించి వాల్మికి మహర్షి రాయలేదనేది సత్య దూరం. అరణ్య వాసం మొదలు పెట్టాక గుహుడి గురించిన ప్రస్తావన ఉంది. కానీ రంగనాయకమ్మ ఆ విషయం మర్చిపోతుంది, ఎందుకంటే గుహుడు రాముడిని ఆరాధించాడు. వాదన చెయ్యాలంటే ఏదో ఒక కారణం ఉండాలి అంతేకానీ కేవలం వాదన కోసమే వాదిస్తే ఇలానే ఉంటాయి..  

మరొక కామెడీ:
ఒక పాత్ర ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు, ఆ పాత్రకి మనసులో కూడా అదే విధంగా ఉండనూ వచ్చు, ఉండకపోవచ్చు. మనిషి మనసులో తనకు ఇష్టం లేని విషయాలని, కార్యాల్ని ప్రశ్నించి, తర్కించి, వ్యతిరేకించే కంఠాలు ఉంటాయి. అందుచేత అలాంటి కంఠాలు కూడా విషవృక్షం కథల్లో పాత్రల్లా ఉంటాయి. ఆ పాత్రలు "రాముడి ఆత్మ", "లక్ష్మణుడి ఇంగితం", "సీతలో సీత" అనే పేర్లతో ఉంటాయి. అవి అప్పుడప్పుడూ వ్యక్తుల మనోభావాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఇది మూల కథకు ద్రోహం చెయ్యడం అవదు. 

ఇప్పుడు పైన రంగనాయకమ్మ చెప్పిన లాజిక్ ను ఇంకొక చోట ఉపయోగించి చూద్దాం. మన ప్రారబ్దం బాలేక రంగనాయకమ్మ తన ఆత్మకథ రాసింది అనుకుందాం. అందులో "రంగనాయకమ్మ ఆత్మ" అని ఒక కంఠాన్ని ప్రవేసి పెట్టి ఆ పాత్ర చేత మనకు నచ్చిన విషయాలు రాసుకుంటే వాటికీ రంగనాయకమ్మ కు ఏమన్నా సంబంధం ఉంటుందా?? ఇది పూర్తిగా లేని భావాలను ఆయా పాత్రలకు తమకు అనుకూలంగా అంటగట్టడం తప్ప మరొకటి కాదు. పైగా ఇది మూల కథకు ద్రోహం కాదని ఆమెకు ఆమే సర్టిఫై చేసుకోవడం.  Anyways, Lets move on!

3.కవి మసిపూసి మారేడు కాయ చేసినవి
రాముడికి శతృపక్షం రాక్షసులు. ఈ రాక్షసులు ఏ జీవ శాస్త్రం లోనూ లేని కవి స్వంత సృష్టి. కథంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కల్పనని యథాతథంగా అంగీకరించవలసిన అవసరం పాఠకులకు ఉండదు.

పాఠకులకు ఏమి అవసరమో ఏమి అనవసరమో పాఠకులకు తెలుసు వారి గురించి వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం రంగనాయకమ్మకు ఎందుకు కలిగిందో పాపం..

4. కవి స్పష్టంగా చెప్పినవి:
కొన్ని విషయాలు కథలో ఎక్కడో ఒక చోట బయటపడతాయి.

ఎక్కడో ఒక చోట బయటపడే విషయాలు స్పష్టంగా చెప్పినవా?? కిం.ప.దొ.న.

(మరిన్ని విషయాలు మరొక పోస్టులో చూద్దాం)


రామదండు 

Sunday 20 May 2012

పీఠిక లోనే మొదలైన పీడ - 1


ముందుగా రంగనాయకమ్మ విషవృక్షం పీఠికలో రాసిన ఈ క్రింద వాక్యాలు చదవండి.

ఈ కథ వల్ల మనకు స్పష్టమయ్యే విషయాలు:

౧. సమాజం అప్పటికే ధనిక పేద వర్గాలుగా విడిపొయింది..
౨. దశరథుడు, రాముడు,రావణుడు వంటి రాజులు ధనిక వర్గ ప్రతినిధులు. అసలు వాళ్ళే సిరిసంపదలు కల ఆస్తిపరులు, ధనికులు..
౩. స్త్రీలు అస్వతుంతృలుగా , వ్యక్తిత్వ శూన్యులుగా పురుషాంధకారపు నీడలో జీవచ్చవ జీవితాలు గడిపారు.
౪. సామాన్య ప్రజానీకం- పేదతనంలో, కులభేదాలలో ముష్టితనం లో, వేశ్యా వృత్తిలో , మత మౌఢ్యం లో , ఒక జాతిని ఇంకో జాతిని ఒక వర్గం ఇంకో వర్గాన్ని పీడించే యుద్దాలలో , వెయ్యి నిలువుల లోతున కూరుకుపోయి ఉన్నారు.
౫. పాలకవర్గ సాహిత్యము, దోపిడీ సంస్కృతి , సూక్ష్మ క్రిములై ప్రజల ఆస్తుల్ని, ఆత్మల్ని పట్టేశాయి.

పైన పేర్కొన్న విషయాలన్నీ  చాలా బరువైన ఆరోపణలు కానీ ఈ ఆరోపణలు ఏ కారణం తో చేసిందో రంగనాయకమ్మ ఎక్కడా చెప్పలేదు. సరే! పీఠిక లో అన్ని విషయాలూ విశదీకరించరు అని సరిపెట్టుకోవాలన్నా అంత ఆషామాషీగా తీసుకునే ఆరోపణలు మాత్రం కాదు. ఇలాంటి బరువైన ఆరోపణలు చేసేటప్పుడు కనీసం లేశమాత్రంగానైనా వివరాలు ఇవ్వకపోవడం ఈ పుస్తకం రాయడం వెనుక సదరు రచయిత ఉద్దేశ్యాలను అనుమానించాల్సివస్తోంది.రామాయణం చదివాక ఆమె ఈ ఆరోపణలు చేస్తోందా లేక ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి రామాయణం చదివిందా/చదివానని చెప్పుకునిందా??


ఇక ఈ పీఠికతో అత్యంత ముఖ్యమైన విషయం:

"రాముడు జ్యేష్ఠ కుమారుడైనా అతనికి రాజ్యం మీద హక్కు లేదు! రాజ్యం భరతుడిదే! ఎందుకంటే దశరథుడు కైకను పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డ కే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విషయం వాల్మికి రాసిందే . ఇది రామాయణానికంతటికీ ఆధారమైన ముఖ్య విషయం. ఇంత ముఖ్య విషయాన్ని కవి అల్ప విషయంగా ఒక మూలకు తోసేసి ,దాని సంగతి ఎప్పటికో ఎత్తాడు. రాముడు అడవుల్లో ఉన్నప్పుడు .. అప్పుడు బయటపడింది ఆ విషయం. పైగా రాముడి నోటి ద్వారానే ! అంటే, ఆ సంగతి రాముడికి మొదటినుండీ తెలుసన్నమాట."

వాల్మీకి ఈ విషయం ఏ పద్యాలలో రాశాడో రంగనాయకమ్మ చెప్పలేదు. కనీసం రామాయణం లోని ఏ  కాండ లో ఏ పద్యాలలో ఈ విషయాలు రాశారో చెప్పలేదు.

ఆ తర్వాతి వాక్యాలు ఇలా ఉన్నాయి:
రాముడికి భరతుడి హక్కు సంగతి తెలియక పోవడం వల్లనే పట్టాభిషేకానికి సిద్దపడితే అది రాముడి తప్పు అవదు. కానీ, ఆ  విషయం తెలిసీ రాముడు పట్టాభిషేకానికి సిద్దపడ్డాడంటే అది రాముడి కపటం అవదూ??

పితృ వాక్య పరిపాలన అనే నియమం రాముడు పాటించేవాడని రంగనాయకమ్మ చాలా  convenient గా మరిచిపోయింది. ఈ పితృవాక్య పరిపాలన గురించి మరింత విపులంగా ముందు ముందు చెప్పుకుందాం.

"భరతుడి  హక్కు సంగతి రాముడికి కూడా తెలుసు " అన్నట్టు కవి ఎందుకు రాశాడు?? రాముడికేమీ తెలియకే పట్టాభిషేకానికి అంగీకరించాడు  అన్నట్టు కథ నడపవచ్చు కదా?? కవి అలా ఎందుకు చేయలేదు?? - ఇలాంటి సందేహాలు చాలా వస్తాయి మనకి . కానీ ఈ కథలో కొన్ని సందేహాలకు జవాబులే దొరకవు.

రంగనాయకమ్మ తనకు వచ్చిన సందేహాలు అందరికీ వస్తాయాని/వచ్చాయని ఊహించి జెనరలైజ్  చెయ్యడం ఎంత వరకూ సబబో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా.. కాకపోతే కొన్ని సందేహాలకు సమాధానాలు దొరకవు అనడం విడ్డూరం. ఆమెకు దొరకలేదంటే ఎవరికీ దొరకలేదని కాదు.ఇలాంటి జెనరలైజేషన్ వల్ల రచయిత మీద  గౌరవం తగ్గడం మినహా మరే ఉపయోగం లేదు. అసలు మనిషి జ్ఞాన సముర్పార్జన మొదలైంది సందేహాలతోనే ! తమ మేధస్సుకు అర్థం కాని సందేహాలకు సమాధానాలు దొరకాలంటే ఎవరైనా తమ కంటే పెద్దలను/అనుభవజ్ఞులను కలిసి కొంత మేధోమధనం చెయ్యాలి. రంగనాయకమ్మ లాంటి అపర మార్క్సిస్ట్ మేధావికి ఇంత చిన్న విషయం తెలియక పోవడం కడు విచారకరం.

మరొక విషయం:

రాముడికి రాజ్యం మీద హక్కే లేనప్పుడు ఇక రాముడికి జరిగిన అన్యాయం ఏముంది? రాముడికి రాజ్యం దక్కలేదని అందరూ శోకాలు పెట్టడం లో అర్థం ఏముంది?? దశరథుడు చివరికి రాజ్యాన్ని భరతుడికే ఇవ్వడానికే ఒప్పుకున్నాడంటే రాజ్యం భరతుడిదే అని తేలినట్టే కదా?? భరతుడి హక్కే నిజం అయితే రాముడి హక్కు అబద్దం అయిపోవలసిందే కదా?? "రామాయణం" కథే దాని గొప్పతనమే అబద్దం అయిపోతుంది కదా??

రాముడి కోసం అందరూ శోకాలు పెడితే మధ్య రంగనాయకమ్మ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.. దశరథుడు చివరికి రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడని రాసింది, అంటే మొదట రాముడికి ఇవ్వాలని అనుకున్నమాట నిజమే కదా.. రాముడికి రాజ్యం మీద హక్కు లేకుంటే రామాయణం గొప్పతనం అబద్దం అయిపోతుందని రంగనాయకమ్మ చెప్పిన కంక్లూజన్ అపరిపక్వంగా ఏదో ఒకటి విమర్శించడానికి అన్న మాటలుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం పసలేదు. రామాయణం అంటే ఒక్క అయోధ్య కాండ మత్రమే కాదు, అందులో ఇంకా చాలా కథ ఉంది. సరే! ఆ కథ గురించి రంగనాయకమ్మ 750 పేజీలు రాసింది వాటిలో ప్రతీ పేజి గురించి నేను కూడా రాస్తాను. Let the party begin!!  


రామదండు