ఈ విష వృక్షం గురించి తెలిసినప్పుడు నాకు వచ్చిన మొదటి డౌటు "రామాయణమే ఎందుకు?? వేరే పుస్తకాల గురించి ఎందుకు రాయలేదు" వేరే పుస్తకాలంటే ఖురాన్, బైబిల్ లాంటివి కాదు. ఎందుకంటే వాటి గురించి రాసుంటే రాసిన రంగనాయకమ్మ పబ్లిష్ చేసిన పబ్లిషర్ ఇద్దరూ కాలగర్భం లో కలిసిపోయి కనీసం మూడు దశాబ్దాలు అయ్యేది. భారతం విషవృక్షం , భాగవతం విషవృక్షం లాంటివి రాసి ఉండచ్చు. తిట్టడమే ధ్యేయమైనప్పుడు ఏ పుస్తకాలైతే ఏం తేడా వస్తుంది?? పై పెచ్చు రాముడి ఆత్మ, సీత లో సీత లాంటి పాత్రలు సృష్టించడానికి కూడా పుస్తకం ఏమిటన్నది అనవసరం. అయినా కూడా రంగనాయకమ్మ రామాయణాన్నే ఎంచుకుంది. దీనికి నాకు తోచిన కారణాలు ఇక్కడ రాస్తున్నా..
౧. ఫలానా ఎవరు??
తెలుగు సినిమా డైరెక్టర్ యస్వీ కృష్ణారెడ్డి గారి మొదటి సినిమా పేరు "కొబ్బరి బోండాం". ఆ సినిమాకు ఆ పేరేందుకు పెట్టారని అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం "ఆ పేరు వింతగా ఉంది కాబట్టి అందరూ సినిమా తీశింది ఎవరు అని ఇంటరెస్ట్ చూపిస్తారు, మొదటి సినిమా తర్వాత నాకు అది ఉపయోగ పడింది అని". రంగనాయకమ్మ కూడా ఖచ్చితంగా ఈ సిద్దాంతాన్నే వాడుకుంది. ప్రచారం రావాలంటే ఎదో ఒక గొప్ప పని చేస్తే రావాలి లేదా ఎవరైనా ఆల్రెడీ ఫేమస్ వ్యక్తి ద్వారా రావాలి. రంగనాయకమ్మ నమ్మే మార్క్స్ -మావో ఈ దేశానికి ఏ మాత్రం సంబంధం లేని వారు.. వారి భజనలు ఎంతగా చేసినా ఎవరూ పట్టించుకోరు. అందుకని ఈ మార్గం లో వార్తలలో నిలిచింది. ఇందులో తప్పేమీ లేదు. కీర్తి కండూతి మనిషిలోని జ్ఞానాన్ని చంపేస్తుంది అంటారు.
౨. publicity mongering
౨౦౦౬ లో మొయిన్ ఖాన్ అనే పాకిస్తానీ క్రికెటర్ "సచిన్ కళ్ళల్లో భయాన్ని చూశాను" అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు యాహూ సెర్చ్ టాప్ సెర్చెడ్ ఐటెంస్ లో మొయిన్ ఖాన్ పేరు ఉంది. రంగనాయకమ్మ చేసింది ఇదే.. చాలా కాలం క్రితం కవి సామ్రాట్ విశ్వనాథ గారు "రామాయణ కల్పవృక్షం" అనే ఒక పుస్తకం రాశారు. అందులో రామాయణం నుంచీ నేర్చుకోవాల్సిన విలువల గురించి రాశారు. కవి సామ్రాట్ రాసినదాన్ని విమర్శించారంటే సహజంగానే పాఠకులలో కుతూహలం ఉంటుంది దాన్ని సొమ్ము చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం తప్పూ కాదు అందులో ఏ రకమైన దోషం కూడా లేదు. ఎవరి మానసిక స్థాయికి తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. దానికి వాళ్ళను తప్పు పట్టలేము. స్వాతి చినుకు ముత్యపు చిప్ప పైన పడితే అది ముత్యమౌతుంది తాచుపాము తలపై పడితే అది విషమౌతుంది.
౩. సినిమాల ప్రభావం:
విషవృక్షం మొదటి పుస్తకం వచ్చింది ౧౯౭౫ ప్రాంతం లో.. అంతకు రెండు మూడు దశాబ్దాలుగా రాముడి గురించిన సినిమాలు ప్రతీ రెండు మూడేళ్ళకు ఒక సూపర్ హిట్ సినిమా రానే వచ్చింది.ఇంక రామాయణం నాటకాలు, బుర్ర కథలు వగైరా వీటికి అదనం. ఇక భద్రాచలం లాంటి ప్రసిద్ద పుణ్య క్షేత్రాల ద్వారా రాముడి గురించిన విషయాలు ఎప్పుడు ఏదో విధంగా చర్చలలో ఉండనే ఉంటాయి. ఇంత పాపులర్ అయిన రాముడి గురించి ఏం రాసినా అది వార్తే అవుతుంది. ఈ పాయింట్ ను రంగనాయకమ్మ పూర్తిగా వాడుకుంది.
౪. మార్కిజం:
రంగనాయకమ్మ మార్క్సిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆ సిద్దాంతాలను ప్రజలకు చెప్పాలి అంటే ముందుగా సమాజం లో ఉన్నతంగా ఉండే వ్యక్తులను/విలువలను టార్గెట్ చెయ్యాలి. మన సమాజం లో రాముడు ఆ పొజిషన్ లో ఉన్నాడు (శతాబ్దాలుగా). ప్రతీ పురుషుడికి రాముడిని ఆదర్శ మూర్తిగా మన పెద్దలు చెబుతారు. అలాంటి రాముడి తెగడుతూ రాస్తే "అసలు రాముడిని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది?" అనే ఇంటరెస్ట్ పుస్తకం కొనేవాళ్ళు ఉంటారు. పైగా అవసరం అయినా లేకపొయినా తను నమ్మిన కమ్యునిజం గురించిన విషయాలు చెప్పటానికి ఒక ప్లాట్ ఫారం దొరుకుతుంది. (విషవృక్షం పుస్తకం మొదటి పేజిలో "నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఏ వర్గమో తెలుసుకో" -మార్స్కిస్ట్ అని ఉంటుంది.)
పైన చెప్పిన కొన్ని కారణాల వల్ల రంగనాయకమ్మ తన పైత్య ప్రకోపాన్ని విశృఖలంగా ప్రదర్శించడానికి రామాయణాన్ని ఎంచుకుంది.
ఇక ఇప్పుడు రంగనాయకమ్మ అభిమానులు ఈ పుస్తకం గురించి చెప్పిన విషయాలు చూద్దాం:
౧. స్త్రీ అభ్యుదయం వగైరా:
దీని గురించిన సమగ్రమైన చర్చ మరొక టపాలో చేస్తాను. (ఆ టపాకు ఇంకా కొంచెం టైం ఉంది)
అంతలోపు ఒక విషయం, స్త్రీల గొప్ప తనం గురించి రాయాలంటే రాణీ రుద్రమ్మ దేవి నుంచీ నేటి జాతీయోద్యమం వరకూ చాలామంది ధీరవనితలు ఉన్నారు. వారి గురించిన విషయాలు స్పూర్తిదాయకంగా రాయచ్చు. కానీ అవి ఎందుకు రాయలేదు?? కమ్యూనిస్టులకు భారతీయులు సరిపోరు అనుకుంటే ఫ్లోరెంస్ నైటింగేల్, జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి వాళ్ళ గురించి కూడా రాయలేదు.. ఎందుకట?? male bashing is NEVER equal to woman empowerment.
౧. ఫలానా ఎవరు??
తెలుగు సినిమా డైరెక్టర్ యస్వీ కృష్ణారెడ్డి గారి మొదటి సినిమా పేరు "కొబ్బరి బోండాం". ఆ సినిమాకు ఆ పేరేందుకు పెట్టారని అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం "ఆ పేరు వింతగా ఉంది కాబట్టి అందరూ సినిమా తీశింది ఎవరు అని ఇంటరెస్ట్ చూపిస్తారు, మొదటి సినిమా తర్వాత నాకు అది ఉపయోగ పడింది అని". రంగనాయకమ్మ కూడా ఖచ్చితంగా ఈ సిద్దాంతాన్నే వాడుకుంది. ప్రచారం రావాలంటే ఎదో ఒక గొప్ప పని చేస్తే రావాలి లేదా ఎవరైనా ఆల్రెడీ ఫేమస్ వ్యక్తి ద్వారా రావాలి. రంగనాయకమ్మ నమ్మే మార్క్స్ -మావో ఈ దేశానికి ఏ మాత్రం సంబంధం లేని వారు.. వారి భజనలు ఎంతగా చేసినా ఎవరూ పట్టించుకోరు. అందుకని ఈ మార్గం లో వార్తలలో నిలిచింది. ఇందులో తప్పేమీ లేదు. కీర్తి కండూతి మనిషిలోని జ్ఞానాన్ని చంపేస్తుంది అంటారు.
౨. publicity mongering
౨౦౦౬ లో మొయిన్ ఖాన్ అనే పాకిస్తానీ క్రికెటర్ "సచిన్ కళ్ళల్లో భయాన్ని చూశాను" అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు యాహూ సెర్చ్ టాప్ సెర్చెడ్ ఐటెంస్ లో మొయిన్ ఖాన్ పేరు ఉంది. రంగనాయకమ్మ చేసింది ఇదే.. చాలా కాలం క్రితం కవి సామ్రాట్ విశ్వనాథ గారు "రామాయణ కల్పవృక్షం" అనే ఒక పుస్తకం రాశారు. అందులో రామాయణం నుంచీ నేర్చుకోవాల్సిన విలువల గురించి రాశారు. కవి సామ్రాట్ రాసినదాన్ని విమర్శించారంటే సహజంగానే పాఠకులలో కుతూహలం ఉంటుంది దాన్ని సొమ్ము చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం తప్పూ కాదు అందులో ఏ రకమైన దోషం కూడా లేదు. ఎవరి మానసిక స్థాయికి తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. దానికి వాళ్ళను తప్పు పట్టలేము. స్వాతి చినుకు ముత్యపు చిప్ప పైన పడితే అది ముత్యమౌతుంది తాచుపాము తలపై పడితే అది విషమౌతుంది.
౩. సినిమాల ప్రభావం:
విషవృక్షం మొదటి పుస్తకం వచ్చింది ౧౯౭౫ ప్రాంతం లో.. అంతకు రెండు మూడు దశాబ్దాలుగా రాముడి గురించిన సినిమాలు ప్రతీ రెండు మూడేళ్ళకు ఒక సూపర్ హిట్ సినిమా రానే వచ్చింది.ఇంక రామాయణం నాటకాలు, బుర్ర కథలు వగైరా వీటికి అదనం. ఇక భద్రాచలం లాంటి ప్రసిద్ద పుణ్య క్షేత్రాల ద్వారా రాముడి గురించిన విషయాలు ఎప్పుడు ఏదో విధంగా చర్చలలో ఉండనే ఉంటాయి. ఇంత పాపులర్ అయిన రాముడి గురించి ఏం రాసినా అది వార్తే అవుతుంది. ఈ పాయింట్ ను రంగనాయకమ్మ పూర్తిగా వాడుకుంది.
౪. మార్కిజం:
రంగనాయకమ్మ మార్క్సిస్ట్ అనే విషయం తెలిసిందే. ఆ సిద్దాంతాలను ప్రజలకు చెప్పాలి అంటే ముందుగా సమాజం లో ఉన్నతంగా ఉండే వ్యక్తులను/విలువలను టార్గెట్ చెయ్యాలి. మన సమాజం లో రాముడు ఆ పొజిషన్ లో ఉన్నాడు (శతాబ్దాలుగా). ప్రతీ పురుషుడికి రాముడిని ఆదర్శ మూర్తిగా మన పెద్దలు చెబుతారు. అలాంటి రాముడి తెగడుతూ రాస్తే "అసలు రాముడిని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది?" అనే ఇంటరెస్ట్ పుస్తకం కొనేవాళ్ళు ఉంటారు. పైగా అవసరం అయినా లేకపొయినా తను నమ్మిన కమ్యునిజం గురించిన విషయాలు చెప్పటానికి ఒక ప్లాట్ ఫారం దొరుకుతుంది. (విషవృక్షం పుస్తకం మొదటి పేజిలో "నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఏ వర్గమో తెలుసుకో" -మార్స్కిస్ట్ అని ఉంటుంది.)
పైన చెప్పిన కొన్ని కారణాల వల్ల రంగనాయకమ్మ తన పైత్య ప్రకోపాన్ని విశృఖలంగా ప్రదర్శించడానికి రామాయణాన్ని ఎంచుకుంది.
ఇక ఇప్పుడు రంగనాయకమ్మ అభిమానులు ఈ పుస్తకం గురించి చెప్పిన విషయాలు చూద్దాం:
౧. స్త్రీ అభ్యుదయం వగైరా:
దీని గురించిన సమగ్రమైన చర్చ మరొక టపాలో చేస్తాను. (ఆ టపాకు ఇంకా కొంచెం టైం ఉంది)
అంతలోపు ఒక విషయం, స్త్రీల గొప్ప తనం గురించి రాయాలంటే రాణీ రుద్రమ్మ దేవి నుంచీ నేటి జాతీయోద్యమం వరకూ చాలామంది ధీరవనితలు ఉన్నారు. వారి గురించిన విషయాలు స్పూర్తిదాయకంగా రాయచ్చు. కానీ అవి ఎందుకు రాయలేదు?? కమ్యూనిస్టులకు భారతీయులు సరిపోరు అనుకుంటే ఫ్లోరెంస్ నైటింగేల్, జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి వాళ్ళ గురించి కూడా రాయలేదు.. ఎందుకట?? male bashing is NEVER equal to woman empowerment.
౨.ఆ పుస్తకం మూడు సార్లు పున:ముద్రణ పొందింది. అది ఈ పుస్తకం పాపులారిటీని సూచిస్తుంది:
మూడు సార్లు పున: ముద్రణ పిందడం ఏ పుస్తకానికైనా చాలా మంచి విషయం. కానీ పున:ముద్రణ వెనకాల ఉన్న కారణాలను చూద్దాం:
అ) అప్పట్లో ఆడవాళ్ళకు పత్రికలు/పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేవాళ్ళు. వాళ్ళను విక్టిమైజ్ చేస్తూ రంగనాయకమ్మ బలిపీఠం లాంటి ఊకదంపుడు పుస్తకాలు రాసింది. సహజంగా అలాంటి రచయిత నుంచీ వచ్చిన రచనలంటే వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఆ లేడీ మార్కెట్ ను బాగా వాడుకుంది.
ఆ) మిషనరీలు రాముడిని దూషించడానికి తమ దేవుడు గొప్ప వాడని చెప్పుకోవడానికి ఈ పుస్తకాన్ని వాడుకుంటున్నారు. ౧౯౯౮ లో ఒకానొక మిషనరీ రామాయణ విషవృక్షం పుస్తకం లోని విషయాలను చూపిస్తూ రాముడిని కించపరచడం నేను చూశాను. అంతే కాక ఈ వ్యాసం రాయడానికి ముందు నాకు తెలిసిన కొందరు వీ.హెహ్.పీ. కార్యకర్తలకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కంఫరం చేసుకున్నాను. వాళ్ళకు మిషనరీల మోడస్ ఆపరెండీ బాగా తెలుసు. మరి రంగనాయకమ్మ మిషనరీల దగ్గర నుంచీ ఎంత డబ్బు తీసుకుందో నాకు తెలీదు.
ఇ) కమ్యూనిస్టులు ఈ పుస్తకాన్ని తమ క్యాడర్లలో పంచడం.
౩. మొన్న మరొక కమ్యూనిస్టు చెప్పినట్టు వర్గ దృక్పథం:
సమాజమంతా ఎప్పుడూ ఒకటిగా లేదు. అది వర్గాలుగానే ఉంది అనేది కమ్యూనిస్టుల భావన. ఆ భావజాలాన్ని endorse చేసేందుకు ఈ పుస్తకం పనికి వచ్చింది.
సర్వేజనా సుఖినోభవంతు.
- రామదండు.
- రామదండు.